Donnerstag, 7. Juni 2018

| సంభాషణ | న్యాయంకోసం పోరే వాళ్లకు సంకెళ్లు | అరుణాంక్ లత |


~
చారిత్రక భీమా కోరేగామ్ వీరోచిత పోరు వారసత్వాన్ని కొనసాగించాలని, నయా పీష్వాల పాలనకు అంతం పలకాలని సభ పెట్టుకున్న వాళ్లలో కొందరు అరెస్టు అయ్యారు. ప్రకాష్ అంబేద్కర్ మొదలు జిజ్ఞేశ్ మేవాని, సంజయ్ కాక్, ఆనంద్ పట్వార్డాన్, ఉమర్ ఖలీద్ దాకా ఆ మీటింగ్ లో పాల్గొన్న వారందరిపైనా కేసులు పెట్టారు. ʹరెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారుʹ అని అభియోగం. అక్కడ మొదలైన కేసుల పరంపర ఆ ఎనమండుగురు వలస కూలీలకు వేసిన మావోయిస్టు ముద్రతో వీరిదాక వచ్చింది. వీరందరి ఇళ్లపైన కబీర్ కళా మంచ్ సభ్యుల ఇళ్లతో సహా పోలీసుల దాడులు జరిగాయి. పూణే చిత్పవన్ బ్రాహ్మణులు, నయా పీష్వాలు, దళితుల ర్యాలీ మీద దాడికి కారకులు శంభజి బీడే, మిళింద్ ఎక్బోటే లను కాపాడేందుకు నాగపూర్ కేంద్రంగా జరిగిన కుట్ర ఇది. పుణె చిత్పవన్ బ్రాహ్మలు, rss కలిసి చేసిన కుట్ర ఇది. ఈ ఐదుగురిని లక్ష్యం చేసుకోవడానికి కారణం స్పష్టమే. వీరంతా వివిధ రంగాల్లో పీడిత కులాల, వర్గాల ప్రజల తరఫున మాట్లాడుతున్న వారు.

Keine Kommentare:

Kommentar veröffentlichen